కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 16, 17 తేదీల్లో రెండురోజుల పాటు హైదరాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ 2020-21కి సంబంధించి ప్రభావితమయ్యే వివిధ వర్గాలు, వాటాదారులతో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించనున్నారు. “ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఫిబ్రవరి 16 మరియు 17 తేదీలలో హైదరాబాద్ మరియు బెంగళూరులలో రెండు రోజుల అధికారిక పర్యటనలో ఉంటారు. బడ్జెట్ 2020-21 లో పలు అంశాలపై వివిధ వాటాదారులతో ఆమె సమగ్ర ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించనున్నారు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
రెండు నగరాల్లో కూడా మొదటి సెషన్లో వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి బ్యాంకర్లు మరియు రైతు సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. అలాగే రెండవ సెషన్లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన రూపకర్తలతో భేటీ అవుతారు. మరోవైపు ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదల, ఆరోగ్య రంగం, విద్య, దేశంలో మౌళిక సదుపాయాల నిర్మాణం వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
[subscribe]