భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. కాగా ఇటీవలే అజారుద్దీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ.. పరిస్థితి విషమించడంతో అజీజుద్దీన్ ఈ నెల 18న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్లోని అజారుద్దీన్ నివాసానికి వెళ్లిన మంత్రి హరీశ్ ఆయనను పరామర్శించారు. పితృవియోగ బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి హరీశ్ రావు, అజారుద్దీన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY