ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై అధికార వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తోంది. ఇటీవలే విశాఖపట్నంలో ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఈరోజు భారీ రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన చేపట్టింది. మూడు రాజధానులకు మద్దతుగా మరియు కర్నూలులో హైకోర్టు సాధనే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు భారీగా పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అంటూ’ నినాదం ఇచ్చారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ కూడా జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లే రాయలసీమలో కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా రాయలసీమకు చేసిందేమీ లేదని, జగన్ సీఎం అయ్యాకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని అన్నారు. కర్నూలుకు న్యాయ రాజధానితో ప్రగతి వేగం పుంజుకుంటుందని, ఇది రాయలసీమ ఆకాంక్షలను వెల్లడించే దీక్ష అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY