పునీత్‌ రాజ్‌కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు, నవంబర్ 1న జరిగే కార్యక్రమంకు జూ.ఎన్టీఆర్ హాజరు

JR NTR will Attend Karnataka Ratna Award Ceremony at Karnataka Assembly on NOV 1st Late Puneeth Rajkumar Got Award, JR NTR Attend Karnataka Ratna Award Ceremony, Karnataka Assembly on NOV 1st, Late Puneeth Rajkumar Got Award,Mango News,Mango News Telugu, JR NTR, Karnataka Ratna Award, Karnataka Ratna Award Ceremony, Karnataka Ratna Award, Late Puneeth Rajkumar Got Award, Late Puneeth Rajkumar, Puneeth Rajkumar, JR NTR

నవంబర్ 1వ తేదీన బెంగుళూరులోని విధాన సౌధ/అసెంబ్లీలో కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా జరనున్న కార్యక్రమానికి ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరుకానున్నారు. కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్ కు “కర్ణాటక రత్న” అవార్డును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆహ్వానం మేరకు నవంబర్ 1న సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో జరిగే కర్ణాటక రత్న అవార్డు అందజేత కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబార్‌, జూ.ఎన్టీఆర్, పునీత్ కుటుంబసభ్యులు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు.

ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబరు 29న మరణించారు. కాగా కర్ణాటకలో విశిష్ట పురస్కారంగా భావించే కర్ణాటక రత్న అవార్డును అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. మొదటి కర్ణాటక రత్న అవార్డు 1992లో పునీత్ తండ్రి, దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కి లభించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =