తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల (సివిల్ సప్లైస్) కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్ నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు సర్దార్ రవీందర్ సింగ్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ పదవీలో సర్దార్ రవీందర్ సింగ్ రెండేళ్లపాటుగా కొనసాగనున్నారు.
వృత్తి పరంగా న్యాయవాది అయిన రవీందర్ సింగ్ ముందుగా బీజేపీలో చేరి కరీంనగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పని చేశాడు. 2006లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం కరీంనగర్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా, 2014లో కరీంనగర్ మేయర్గా కూడా సర్దార్ రవీందర్ సింగ్ పనిచేశారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు రవీందర్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE