వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. ముందుగా తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి పోలీసు వాహనంలో లోటస్ పాండ్ లోని ఆమె నివాసానికి తరలించారు. కాగా అప్పటి నుంచి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం వద్ద కూడా వైఎస్ షర్మిల తన ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిలకు డా.సునీతా రెడ్డి, డా.ప్రవీణ్ కుమార్ లతో కూడిన వైద్యుల బృందం శనివారం సాయంత్రం రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిల ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని పార్టీ యంత్రాంగానికి వైద్యుల బృందం సూచించింది. బీపీ లెవెల్స్ పడిపోవడం, ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో షర్మిల డీహైడ్రేషన్ కు గురైనట్లుగా తెలిపారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. అయితే పాదయాత్ర కు అనుమతి వచ్చే వరకు దీక్ష ఆపేది లేదని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE