ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం వుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 1,000కి పైగా పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1లో 100కి పైగా పోస్టులు, గ్రూప్ 2లో 900కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు వున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. ఇక ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE