ఈశాన్య రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పరుగులు ప్రారంభించింది. ఈ సెమీ-హై స్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు ప్రయాణిస్తుంది. వివిధ మార్గాల నుంచి ఢిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది. ఇంతకుముందు అజ్మీర్, వారణాసి, కత్రా, భోపాల్, అంబ్ అందౌరాల ప్రాంతాలను వందే భారత్ రైళ్లతో ఢిల్లీకి అనుసంధానించడం తెలిసిందే. కాగా ఈనెల 29 నుంచి ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం మినహా వారంలోని అన్ని రోజులలో ఈ రైలు నడుస్తుందని, 4 గంటల 45 నిమిషాలలో 302 కి.మీ. ప్రయాణ దూరాన్ని ఇది కవర్ చేస్తుందని చెప్పారు. ఇక ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏసీ చైర్ కార్ టిక్కెట్ ధర రూ.1,065 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.1,890గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE