కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ నెల 20న కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి శాఖలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా మరో 24 మంది ఎమ్మెల్యేలకు తన కేబినెట్లో చోటు కల్పించారు. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. తాజాగా మరో 24 మందితో మంత్రివర్గాన్ని విస్తరించినందున అందరీకి ఒకేసారి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక సీఎం సిద్దరామయ్య క్యాబినెట్లో ఒక మహిళకు చోటు దక్కింది. కాగా, కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగగా.. 13న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను తన ఖాతాలో వేసుకుని ఘన విజయం సాధించింది.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నేతలు వీరే..
- దినేష్ గుండురావు
- కృష్ణ బైరేగౌడ
- ఈశ్వర్ ఖండ్రే
- రహీంఖాన్
- సంతోష్ లాడ్
- క్యాథసంద్ర ఎన్. రాజన్న
- కె. వెకటేష్
- హెచ్సి మహదేవప్ప
- బైరతి సురేష్
- శివరాజ్ తంగడి
- తిమ్మాపూర్ రామప్ప బాలప్ప
- బి. నాగేంద్ర
- లక్ష్మీ హెబ్బాల్కర్
- మధు బంగారప్ప
- డి. సుధాకర్
- చెలువరాయ స్వామి
- మంకుల్ వైద్య
- ఎమ్సి సుధాకర్
- హెచ్కే పాటిల్
- శరణ్ ప్రకాష్ పాటిల్
- శివానంద్ పాటిల్
- ఎస్ఎస్ మల్లికార్జున
- దర్శనపూర్ శరనబసప్ప
- ఎమ్మెల్సీ ఎస్ఎస్ బోసరాజు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE