తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రం మెడికల్ హబ్ గా మారుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని పీవీ మార్గ్లో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ ఇండియా (సెమీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే, 10కే మారథాన్ మరియు సైక్లోథాన్ 10కే రన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందరరావు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని, ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని, జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు అయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనలతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ క్రమంలో కేవలం 85 రోజుల్లోనే 1 కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రికార్డ్ నెలకొల్పామని తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE