భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 14, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10,363 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే కొత్తగా 1211 కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్యలో 1,036 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 339 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 8,988 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన లాక్డౌన్ గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 14, మంగళవారం) ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. మరోసారి దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికి మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2445 కు చేరగా, 160 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి.
దేశంలో 500 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 2455
- ఢిల్లీ – 1510
- తమిళనాడు – 1173
- రాజస్థాన్ – 945
- గుజరాత్ – 617
- మధ్యప్రదేశ్ – 614
- తెలంగాణ – 592
- ఉత్తర ప్రదేశ్ – 558
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]