కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన లాక్డౌన్ గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 14, మంగళవారం) ముగియనుండటంతో ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తునట్టు కీలక ప్రకటన చేశారు. అలాగే కరోనా చేస్తున్న పోరాటంలో పై విజయం సాధించడానికి 7 సూత్రాలను ప్రజలకు వివరించారు. ఈ సూత్రాలను ప్రజలు కచ్చితంగా అమలు చేస్తే కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కరోనాపై పోరులో భాగంగా దేశప్రజలకు పీఎం మోదీ చెప్పిన ఏడు సూత్రాలు:
- దయచేసి వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి వ్యక్తి , ప్రతి కుటుంబం భౌతిక దూరాన్ని పాటించండి.
- ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ప్రతిఒక్కరూ ధరించాలి.
- రోగనిరోధక శక్తిని పెంచుకునేలా ప్రయత్నించండి. అందుకు తగిన ఆహారం, మరియు ప్రతిరోజూ వేడినీళ్లు తీసుకోండి.
- ‘ఆరోగ్య సేతు’ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ వైరస్ కు చెందిన సమాచారం నిరంతరం తెలుసుకోండి.
- పేదలకు మరియు ఆకలితో ఉన్నవారికి సహాయం చేయండి.
- ఈ సమయంలో కరుణతో వ్యవహరించండి. పరిశ్రమలు, ఇతర సంస్థల్లో సిబ్బందిని తీసివేయవద్దు.
- కరోనా పై యోధుల్లా యుద్ధం చేస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పట్ల గౌరవంగా వ్యవహరించండి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]