కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి రేపటి నుంచే (మే 6, బుధవారం) అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. 15 కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని జోన్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అమ్మకాలు ఉంటాయని పేర్కొన్నారు. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోతే అలాంటి ప్రాంతాల్లో వెంటనే అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. బార్లు, పబ్లు, క్లబ్బులకు అనుమతి లేదని అన్నారు.
మద్యం ధరలు కూడా పెంచుతున్నట్టు తెలిపారు. కొన్ని రకాల మద్యంపై 11 శాతం, మరి కొన్ని రకాల మద్యంపై 16 శాతం ధరలు పెంచుతున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్డౌన్ 3.0 లో భాగంగా ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే రెడ్ జోన్స్ ప్రాంతాల్లో కిరాణా షాపులు, మెడికల్ షాప్స్, హార్డ్ వేర్ షాపులు తప్ప ఇంకా ఎలాంటి మినహాయింపులు ఉండవని సీఎం కేసీఆర్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu