కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం నాడు ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు వెల్లడించారు. మే 6, బుధవారం నుంచి 15 కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని జోన్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. అలాగే కరోనా నియంత్రణ, లాక్డౌన్ సడలింపులు, రైతు బంధు, రుణమాఫీ, కేంద్ర సహాయం, 10వ తరగతి పరీక్షలు సహా పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్:
- రాష్ట్రంలో మే 6 నాటికీ 1096 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 628 మంది డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం 439 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- మంగళవారం నాడు 11 కొత్త కేసులు నమోదుకాగా, 43 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- కరీంనగర్ లో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకున్నాం.
- ఆగస్టు,సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.
- రాష్ట్రంలో లాక్ డౌన్ మే 29 వరకు పొడగింపు.
- లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలి.
- జోన్ తో సంబంధం లేకుండా తెలంగాణ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ.
- రెడ్ జోన్స్ లో నిత్యావసర సరుకుల షాప్స్, హార్డ్ వేర్, సిమెంట్ షాప్స్, ఎలక్ట్రానిక్ షాప్స్, అగ్రికల్చర్, గృహ నిర్మాణాల సంబంధించిన షాప్స్ తెరవచ్చు.
- గ్రీన్,ఆరెంజ్ జోన్ లలో గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో అన్ని షాప్స్ తెరవచ్చు.
- ప్రతి షాప్ వద్ద మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసం తప్పనిసరిగా ఉండాలి, లేకుండా షాప్ సీజ్ చేస్తాం.
- గ్రీన్ ,ఆరెంజ్ జోన్ లో ఉన్న మున్సిపల్ లేదా పట్టణ ప్రాంతాల్లో 50% షాప్స్ తెరుచుకుంటాయి.
- ఈ నెల 15 న మరో సారి సమావేశం
- రాష్ట్రంలోని 27 జిల్లా లో అన్ని షాప్స్ తెరుచుకుంటాయి.
- భూమి కొనుగోళ్లు చేసుకోండి.సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ లు రేపటి నుండి నడుస్తాయి.
- ఇసుక మైనింగ్, వాహనాల రిజిస్టేషన్ కార్యాలయాలు రేపటి నుండి తెరుస్తారు.
- 10 వ తరగతి విద్యార్థులకు మే నెలలోనే పరీక్షలు నిర్వహిస్తాం.
- ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ చేపడతాం.
- 22 కోట్ల రూపాయలతో న్యాయవాదులను ఆర్థిక సాయం..
- వలస కూలీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం.
- దేశం లో ఏ రాష్ట్రo ధాన్యం కొనుగోలు చేయడం లేదు . తెలంగాణ లో 100% ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.
- తెలంగాణ లో రైతు రాజ్యం జరుగుతుంది.
- తెలంగాణ లో ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తున్నాం. రైతు బంధులో ఒక్క రూపాయి కోత లేదు.
- రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం.
- రుణమాఫీకి రేపు 1200 కోట్లు విడుదల చేస్తున్నాం. 25 వేల లోపు రుణం ఉన్న రైతులకు వెంటనే మాఫీ.
- రాష్ట్రంలో ఐదున్నర లక్షల మందికి రుణమాఫీ.
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్ జోన్స్ తో సహా రేపు వైన్ షాప్స్ ను తెరుస్తారు.
- బార్లు, పబ్బులు,క్లబ్బులు మూసేవుంటాయి.
- తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం..
- మద్యం రేట్లు 16% పెంపు, చీప్ లిక్కర్ పై 11% పెంపు.
- ఉదయం 10 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు.
- మద్యం షాప్ ల వద్ద భౌతిక దూరం పాటించక పోతే క్షణాల్లో షాప్ సీజ్.
- మాస్కులు లేకపోతే మద్యం అమ్మరు.
- గ్రీన్ జోన్ లో క్యాబ్ లు,ఆటోలకు అనుమతి.
- ఆరెంజ్ జోన్స్ లో క్యాబ్ లకు అనుమతి.
- శుభకార్యానికి 20 మంది, అశుభ కార్యానికి 10 మందికి మాత్రమే అనుమతి.
- మత పరమైన కార్యక్రమాలు అన్ని మే 29 వరకు నిషేధం.
- ఆర్టీసీ బస్సులు, ప్రజారవాణాపై మే 15 తర్వాత నిర్ణయం.
- తెలంగాణ రాష్ట్రం నెల ఆదాయం 15 వేల కోట్లు రావాల్సి ఉండగా,16 వందల కోట్లు వచ్చింది.
- కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu