కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ లో పట్టుబడ్డ వాహనాలను తిరిగి తీసుకెళ్లొచ్చని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. పట్టుబడ్డ వాహనాలకు సంబంధించిన యజమానులు ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని చెప్పారు. ఈ వాహనాలకు సంబంధించిన పత్రాలు పోలీస్ స్టేషన్ లో సమర్పించాలని పేర్కొన్నారు. వాహనాలను యజమానులకు తిరిగి ఇచ్చే అంశంపై ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu