టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత

Andhra Pradesh, Chandrababu expresses anger over police, Chittoor police serve notice to Chandrababu, Mango News, Renigunta Airport, TDP Chief Chandrababu Detained, TDP Chief Chandrababu Detained at Renigunta Airport, TDP chief N Chandrababu Naidu, TDP chief N Chandrababu Naidu squats on floor

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకుంది. రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ముందుగా ఈ పర్యటన కోసం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న చంద్రబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేసి నిలిపివేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు బైఠాయించారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేది లేదంటూ ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేషన్ కు తరలించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + four =