భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,51,767 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6,387 కరోనా పాజిటివ్ కేసులు, 170 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా దేశంలో ప్రతిరోజూ 6వేలకు పైగానే పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ పదో స్థానంలో నిలిచింది.
దేశంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4337 కి చేరింది. కరోనా బాధితుల్లో 64,426 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 83,004 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళ నాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 54,758 కు చేరగా, వీరిలో 16,954 మంది కోలుకున్నారు, 1792 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధికంగా 17,728, గుజరాత్ లో 14,829, ఢిల్లీలో 14,465 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 54,758
- తమిళనాడు – 17,728
- గుజరాత్ – 14,829
- ఢిల్లీ – 14,465
- రాజస్థాన్ – 7,645
- మధ్యప్రదేశ్ – 7,024
- ఉత్తర ప్రదేశ్ – 6,724
- పశ్చిమబెంగాల్ – 4,009
- ఆంధ్రప్రదేశ్ – 2,983
- బీహార్ – 2,968
- కర్ణాటక – 2,283
- పంజాబ్ – 2,106
- తెలంగాణ – 1,991
- జమ్మూ కశ్మీర్ – 1,759
- ఒడిశా – 1,517
- హర్యానా – 1,305
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu