కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచులు ఇకపై ఉదయం 11.30 గంటల నుంచి తెరుచుకుంటాయని, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచుల పనివేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదని ఆ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకులు పనిచేసే సమయాలను మార్చినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ ప్రచారంపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ జోన్ ఎస్బీఐ అధికారులు మే 26, మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పనిచేస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు.
Being vigilant is the only way we can put a lockdown on the spread of #FakeNews.
We urge our customers not to believe in any messages unless shared from official sources. pic.twitter.com/yDtQBKqGNW
— State Bank of India (@TheOfficialSBI) May 26, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu