ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తునట్టు ఫిబ్రవరి 13, గురువారం నాడు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్ అవడంతో పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకువచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఉభయ సభలను ప్రోరోగ్ చేయడం వలన బిల్లులపై ఆర్డినెన్స్ జారీకి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం. గవర్నర్ ఈరకంగా ఉభయ సభలను ప్రొరోగ్ చేయడం సాధారణ ప్రక్రియే అయినప్పటికీ, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడం, సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలోనే ప్రోరోగ్ నోటిఫికేషన్ దిశగా అడుగులేసినట్టు తెలుస్తుంది.
[subscribe]