విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూలై 6వ నుంచి 17వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టీ20 టోర్నమెంట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 టోర్నమెంట్ నిర్వహణ కోసం ఏసీఏ ఇటీవలే బీసీసీఐ అనుమతి కూడా పొందింది. ఈ నేపథ్యంలో ఏపీఎల్ టీ20 టోర్నమెంట్ లోగోను, టీజర్ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
ముందుగా సోమవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రెసిడెంట్ పి.శరత్చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాథ్రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, ఇతర సభ్యులు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎల్ టీ20 లోగో తో పాటుగా, ల్యాప్టాప్లో ఏపీఎల్ టీ20 టీజర్ను కూడా సీఎం ఆవిష్కరించారు. అలాగే జులై 17వతేదీన జరిగే ఏపీఎల్ టీ20 ఫైనల్కు హాజరుకావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వనించారు. మరోవైపు ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ టీ20 మ్యాచులు నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY