ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు 13 జిల్లాల డీసీసీబీ(జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్), డీసీఎంఎస్ (జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) లకు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 13 జిల్లాలలోని ప్రతి డీసీసీబీ, డీసీఎంఎస్ లకు చైర్మన్ తో కలిపి 7 గురు సభ్యులతో కూడిన పర్సన్ ఇంచార్జ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
డీసీసీబీ చైర్మన్ ల వివరాలు:
- కృష్ణా జిల్లా- యార్లగడ్డ వెంకటరావు
- గుంటూరు- రాతంశెట్టి సీతారామాంజనేయులు
- ప్రకాశం- మాదాసి వెంకయ్య
- నెల్లూరు- ఆనం విజయ్కుమార్రెడ్డి
- చిత్తూరు- ఎం.రెడ్డమ్మ
- కర్నూల్- మాధవరం రామిరెడ్డి
- కడప- తిరుపాల్ రెడ్డి
- అనంతపురం- బోయ వీరాంజనేయులు
- శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్
- విజయనగరం- మరిసర్ల తులసి
- విశాఖపట్నం- సుకుమార్ వర్మ
- తూర్పుగోదావరి- అనంత ఉదయ్భాస్కర్
- పశ్చిమగోదావరి- కవురు శ్రీనివాస్
డీసీఎంఎస్ చైర్మన్ ల వివరాలు:
- కృష్ణా జిల్లా- ఉప్పాల రాంప్రసాద్
- గుంటూరు- కే.హేని క్రిస్టినా
- ప్రకాశం- ఆర్.రామనాధం బాబు
- నెల్లూరు- వి.చలపతి రావు
- చిత్తూరు- సామకోటి సహదేవ రెడ్డి
- కర్నూల్- పి.నాగి రెడ్డి
- కడప- దండు గోపి
- అనంతపురం- టి.చంద్రశేఖర్ రెడ్డి
- శ్రీకాకుళం- పిరియా సాయి రాజ్
- విజయనగరం- శిరువూరు వెంకటరమణ రాజు
- విశాఖపట్నం- ముక్కాల మహాలక్ష్మి నాయుడు
- తూర్పుగోదావరి- దున్న జనార్ధనరావు
- పశ్చిమగోదావరి- యడ్ల తాతాజీ
[subscribe]