విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. క్రీ.పూర్వం మొదలుకుని 19వ శతాబ్దం వరకు మానవులు ఉపయోగించిన అరుదైన సుమారు 1500 రకాల వస్తువులు బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో బుద్ధ-జైన గ్యాలరీ, హిందూ శిల్ప కళ గ్యాలరీ, నాణేలు-శాసనాల గ్యాలరీ, ఆయుధాలు-రక్షణ కవచాల గ్యాలరీలలో ఎన్నో విశేషమైన, విశిష్టత కలిగిన వస్తువులు, ప్రతిమలు, పాత్రలు, ఆయుధాలు పదర్శనకు ఉంచారు. అలాగే ఆంధ్రుల వైభవాన్ని వర్ణించేలా, మన సంస్కృతి ఘనతను రాబోయే తరాలు గుర్తించేందుకు దోహదపడేలా ఎన్నో విషయాలు ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. బాపు మ్యూజియం పునఃప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu