జనసేనానికి మొదటి నుంచి లేఖలు మీద లేఖలు రాస్తున్న మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపం అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య.. మరో లెటర్ రాసారు. కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులకు విజ్ఞప్తి అంటే లెటర్ రాసిన ఆయన మరోసారి వార్తలలోకి ఎక్కారు. జనసేన సీట్ల సర్ధుబాటు అంశం నుంచి ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ను కాస్త ఇరకాటంలో పెడుతూ వస్తున్న ఈ పెద్దాయన ఎందుకో కాస్త రూట్ మార్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ కూడా కాపు కులానికి వ్యతిరేకం అంటూ హరిరామజోగయ్య తన లేఖలో వివరించారు. అందుకే ఈ ఎన్నికలలో వైఎస్ జగన్, వైసీపీ అభ్యర్థులను అంతా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అధికారం దక్కించడమే కాపు సంక్షేమ సేన ధ్యేయం అంటూ ఆయన కోరారు.
పవన్ కళ్యాణ్ ఆధిపత్యంలో జనసేన, తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హరిరామజోగయ్య కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులు, కాపు కులస్థులకు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను కలుపుకొని కూటమి అభ్యర్థులతో పాటు మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి నుంచి పోటీ చేస్తున్న 21 మంది అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.
కొంత కాలంగా హరి రామ జోగయ్య కాపుల సంక్షేమం కోసం పట్టు పడుతున్న విషయం తెలిసిందే . మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన తాజాగా కూటమికి కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే కాపులకు ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ..కాస్త ఘాటుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖలు రాస్తూ వస్తున్నారు . అందులో కొన్ని పవన్ను ఇరుకున పెట్టేవిగా ఉండటంతో సోషల్ మీడియాలో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్కు పూర్తి మద్దతుగా లెటర్ రాయడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY