రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను ఏపీ ప్రభుత్వం గతంలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ రోజు ప్రకటించారు. తాజా ప్రభుత్వం నిర్ణయంతో ఓపెన్ స్కూల్ ద్వారా చదువుతున్న 1.68 లక్షల మంది పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu