ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలుగు సంస్కృత అకాడమీకి నలుగురు సభ్యులతో కూడిన గవర్నింగ్ బాడీని కూడా ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డి.భాస్కరరెడ్డి, డా.కప్పనగంతు రామకృష్ణ, డా.రాజకుమార్ నేరెళ్ల, డా.ఎం.విజయశ్రీ గవర్నింగ్ సభ్యులుగా నియమించబడ్డారు. ఇక యూజీసీ నామినీగా తిరుపతి నేషనల్ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధరశర్మను, అకాడమీలో ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ