తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వీరాభిమాని అయిన పీఆర్ మోహన్ 1983 లోనే పార్టీలో చేరి, అప్పటినుంచే పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1984 లో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ గా, 1994, 2014లో రెండు సార్లు శాప్ ఛైర్మన్ గా పీఆర్ మోహన్ పని చేశారు.
తెలుగుదేశం సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అంకితభావం, నిబద్దతలతో పార్టీకి సేవలందించిన మోహన్ మరణం పార్టీకి తీరని లోటు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు పీఆర్ మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ