ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి (జూలై 6) పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ అయ్యేందుకు ఇది మరొక అవకాశం. రేపటి నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షా సమయంగా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. కాగా ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశామని, ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,01,627 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అలాగే సప్లిమెంటరీలో పాసైన విద్యార్థులను రెగ్యులర్ పాస్ అయినట్లుగా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆయా విద్యార్థులకు ఊరటనిచ్చే విషయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ