ఏపీ అసెంబ్లీలో వైసీపీ-టీడీపీ సభ్యుల ఘర్షణపై స్పందించిన చంద్రబాబు నాయుడు, కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu Responds Over The Clash Between YCP and TDP Members in AP Assembly,Chandrababu Naidu Responds Over The Clash,Clash Between YCP and TDP Members,Mango News,Mango News Telugu,TDP MLAs Suspended For Ruckus in House,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Budget Session

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన చంద్రబాబు, అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు’ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదని, సీఎం జగన్ ప్రోద్భలంతో, పక్కా వ్యూహంతోనే నేడు శాసనసభలో దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటన ద్వారా చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ చరితలో నిలిచిపోతారని, స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌ తీవ్ర అసహనానికి లోనవుతున్నారని, టీడీపీ సభ్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =