ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4 న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌరవ వేతనం పెంపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరి-1 ఆలయాల్లో అర్చకులకు గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.రూ.15,625 కి పెంచారు. కేటగిరి-2 ఆలయాల్లో అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అలాగే ఇమామ్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజమ్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచారు. ఇక పాస్టర్లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ