2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదో ఆశించి టీడీపీకి మద్ధతు ఇవ్వలేదని.. ఆంధ్రా ప్రజల భవిష్యత్తుకోసమే టీడీపీకి మద్ధతు ఇచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కచ్చితంగా మార్పు తీసుకొస్తామని.. జగన్ సర్కార్ను ఇంటికి సాగనంపుతామని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారన్న పవన్ కళ్యాణ్.. అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్నని వెల్లడించారు. విజయనగరంలో జరిగిన యువగళం ముగింపు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యువగళం ప్రజల కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర అన్న పవన్ కళ్యాణ్.. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే పాదయాత్ర కాదని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కదిలారన్నారు. పాదయాత్ర వల్ల ఎన్నో అనుభవాలు.. ప్రజల కష్టసుఖాలు తీసుకొచ్చన్న పవన్.. తనకు రాని అవకాశాన్ని లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE