ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- 1 నుంచి ఇంటర్మీడియేట్ చదివే విద్యార్థులకు జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ‘అమ్మ ఒడి’ పథకం. ప్రతి ఏడాది జనవరిలో విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు రూ.15 వేలు నగదు ఖాతాల్లో జమ
- మహిళకు, పిల్లలకు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. 77 మండలాలలో రూ.90 కోట్లతో ఈ కార్యక్రమం అమలు
- పలు రంగాల్లో ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు. జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15న 50 మందికి అవార్డుతోపాటు రూ.10 లక్షల బహుమతితో సత్కరణ
- హజ్, జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఆర్థిక సాయం పెంపునకు ఆమోదం. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ.40 వేల నుంచి రూ.60వేలకు పెంపు. రూ.3 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్నవారికి రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంపు.
- షెడ్యూల్ కులాల కార్పోరేషన్ ను మాల , మాదిగ మరియు రెల్లి, ఇతర కులాల ప్రత్యేక కార్పోరేషన్లగా విభజిస్తూ ఆమోదం
- రాష్ట్రవ్యాప్తంగా 147 నియోజకవర్గాల్లో వైఎస్సార్ ఆగ్రి ల్యాబ్లు ఏర్పాటు. విత్తనాలు, ఎరువులను ల్యాబ్లో పరీక్షించి సరఫరా
- కోస్తా జిల్లాల్లోని 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్లు ఏర్పాటు
- రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ట్రస్ట్ బోర్డుల ఏర్పాటు చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
- నవంబర్ 7 నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, రూ.264 కోట్లు విడుదలకు ఆమోదం
- గ్రామీణ వార్డు స్థాయిలో అదనపు జెఎల్ఎం పోస్టుల భర్తీకి ఆమోదం
- హోం శాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు సాయం అందించాలని నిర్ణయం
- 100 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్
- జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం ప్రాంతంలో బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన 498.3 ఎకరాల భూకేటాయింపు రద్దు
[subscribe]
MP Kesineni Nani Participates In The Inauguration Of Patients Waiting Hall | #YCPEvent | Mango News
03:07
YCP MLA Srikanth Reddy Slams Chandrababu Naidu Over His Statements On CM YS Jagan | AP Politics
09:09
MLA Srikanth Reddy Fires On Nara Lokesh Over Construction Workers Issue | AP Politics | Mango News
09:00
MLA Srikanth Reddy Challenges To Submit All Details Over Sand Mafia Issue In AP | AP Political News
07:51