ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 29, శుక్రవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన సింధు, సీఎం జగన్తో భేటీ అయ్యారు. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్కు సిద్దమవుతున్న కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణించాలని సింధు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పీవీ సింధు ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా కొనసాగుతుంది, ఒలంపిక్స్ సాధన కారణంగా విధులకు హాజరుకాలేకపోతున్నానని ఈ సమయాన్ని ఆన్డ్యూటీగా పరిగణించాలని సీఎంను కోరారు. ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, ఒలింపిక్స్లో పతకం సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రోత్సహించారు. అలాగే ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు స్వర్ణ పతకం సాధించినపుడు బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై స్పందిస్తూ విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం గుర్తింపు జరుగుతోందని, అవసరమైన చోట ఎంపిక చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆమెకు సూచించినట్లు తెలుస్తుంది.
[subscribe]