జూన్ 14న శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan to Tour in Sri Sathya Sai District on June 14th, AP CM to Tour in Sri Sathya Sai District on June 14th, YS Jagan to Tour in Sri Sathya Sai District on June 14th, CM YS Jagan to Tour in Sri Sathya Sai District on June 14th, Sri Sathya Sai District, YS Jagan Sri Sathya Sai District Tour, AP CM Sri Sathya Sai District Tour, Sri Sathya Sai District Tour, AP CM YS Jagan Sri Sathya Sai District Tour, YS Jagan Sri Sathya Sai District Tour News, YS Jagan Sri Sathya Sai District Tour Latest News, YS Jagan Sri Sathya Sai District Tour Latest Updates, YS Jagan Sri Sathya Sai District Tour Live Updates, AP CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 14, మంగళవారం నాడు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. రైతులకు పంట బీమా సొమ్మును అందించే కార్యక్రమానికి సంబంధించి శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో నిర్వహించే సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. చెన్నేకొత్తపల్లిలో నిర్వహించే బహిరంగ సభ నుంచే సీఎం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట బీమా సొమ్మును కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. కాగా కొత్త జిల్లా అయిన శ్రీసత్యసాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా వస్తుండడంతో అధికారులు, పార్టీ నాయకులు సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే చెన్నేకొత్తపల్లిలో సభా వేదిక, హెలిప్యాడ్ సహా ఇతర ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ పర్యవేక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అలాగే సీఎం పర్యటనపై గురువారం స్థానిక కలెక్టరేట్ లో తలశిల రఘురాం, కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =