తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంతో ప్రత్యేక రూ.100 వెండి నాణెం ముద్రించటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 వెండి నాణాన్ని రిజర్వ్ బ్యాంక్ ముద్రించి విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రంతో వెండి నాణెం విడుదలపై గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
“తెలుగు వారు ఎన్టీఆర్ అని ప్రేమగా పిలుచుకునే నందమూరి తారక రామారావు శతాబ్ది జయంతి సందర్భంగా వంద రూపాయల డినామినేషన్ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్బ్యూరో కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేయడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. టీడీపీ తన పొలిట్బ్యూరో సమావేశాన్ని 2023, మార్చి 28న హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించింది మరియు వంద రూపాయల విలువ కలిగిన నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొలిట్బ్యూరో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది” అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు
“తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్. ఎన్టీఆర్ని సన్మానించడమంటే సాధారణంగా తెలుగువారిని, ముఖ్యంగా ఆయన అభిమానులను గౌరవించడమే. ఈ విషయంలో ఎన్టీఆర్ 100వ జయంతిని స్మరించుకున్నందుకు మీ సమర్థ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి పొలిట్బ్యూరో తన కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలుగు ప్రజల తరపున, ఎన్టీఆర్ అభిమానుల, తెలుగుదేశం పార్టీ తరపున మరియు వ్యక్తిగతంగా నా తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE