ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల కోలాహలం కొనసాగుతుండటంతో పొలిటికల్ వాతావరణం హీటెక్కిపోయింది. ఇటు మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు .. వారి ఆస్తులు, అప్పుల వివరాలు కూడా అఫిడవిట్లో తెలియజేస్తున్నారు.దీంతో ఎంతమంది శ్రీమంతులున్నారు. వీరిలో మొదటి స్థానంలో ఎవరున్నారు? చివరి ప్లేసులో ఎవరున్నారు? అనేదానిపై ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
ఇప్పటి వరకు నమోదైన నామినేషన్లలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దంపతులకు ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రశాంతి రెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు ఉండగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరుతో రూ.639.26 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీరిద్దరికీ రూ.197.29కోట్ల అప్పులుండగా.. రూ.6.96 కోట్ల విలువ గల 19 కార్లు ఉన్నాయి.
ప్రశాంతి రెడ్డి తర్వాత అత్యంత సంపన్న అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నిలిచారు. ఆమె తన ఆస్తులను రూ.161.21 కోట్లుగా చూపించిన బుట్టా రేణుక.. అప్పులు కూడా రూ.7.82 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు.
తర్వాత శ్రీశైలం వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబం ఆస్తులు విలువ రూ.131.71 కోట్లు ఉండగా.. అప్పులు రూ.28.24 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2014లో రూ.48.89 కోట్ల ఆస్తులను చూపించాగా.. 10 సంవత్సరాల్లోనే వాటి విలువ భారీగా పెరగడం గమనార్హం. అంతెందుకు 2019 ఎన్నికల్లో కూడా 37 కోట్ల రూపాయలుగానే చూపించిన శిల్పా చక్రపాణి రెడ్డి .. ఈ ఐదేళ్ల వ్యవధిలోనే దాదాపు రూ.100 కోట్లకు పెరగడం చర్చనీయాంశం అయింది.
మరోవైపు హిందూపురం నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తన ఆస్తులు విలువ రూ.81.63 కోట్లుగా ప్రకటించారు. అలాగే అప్పులు రూ.9 కోట్లు ఉన్నట్లుగా చెప్పారు. బాలయ్య భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్లు ఉండగా.. మూడుకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY