వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ కన్నుమూశారు. కాగా రెడ్డయ్య యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పార్థసారథి నివాసానికి వెళ్లి రెడ్డయ్య యాదవ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు జోగి రమేష్ మరియు కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. కాగా రెడ్డయ్య యాదవ్ గతంలో మచిలీపట్నం ఎంపీగా, ఉయ్యూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారథి తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి పెనమలూరు నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE