వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా మారకుండా, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలనీ హితవు పలికారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలను విజయసాయి రెడ్డి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలతో ప్రజా ధనం వృధా కాదని, ఈ విధానాలతో పారదర్శకతలో దేశానికి కొత్త దిశను చూపుతామని పేర్కొన్నారు.
మరో వైపు టీడీపీ పార్టీపై సైతం ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేసాడు. టీడీపీ పార్టీ అనవసరంగా వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఆర్టీసీ సంస్థ మరియు సంబంధిత ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్ అందిస్తుందని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే ప్రయత్నం చేసారని విమర్శించారు.
The bold decisions of our Hon’ble CM would save the taxpayers money and show a new direction to the country in terms of transparency. Instead of indulging in ”cheap publicity”, people like @PawanKalyan should be objective in their criticism. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2019
When @ncbn was the only politician who was involved in selling RTC assets, Our Hon’ble @AndhraPradeshCM Garu’s historic decision to merge APSRTC with AP Govt will surely change the fate of APSRTC and its employees. @ysjagan
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2019
[subscribe]
[youtube_video videoid=uOhAGybQrOc]