ఏపీలో చెత్త ప్రభుత్వం ఉంది: బాలకృష్ణ

Worst Government in AP Says Balakrishna,Worst Government in AP,Worst Government Says Balakrishna,Government in AP,Balakrishna, Hindupuram MLA, Yuvagalam Navashakam sabha, Lokesh Yuvagalam Padayatra,Mango News,Mango News Telugu,Hindupur MLA Balakrishna fires,Yuvagalam Navasakam,Balakrishna Latest News,Balakrishna Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Balakrishna, Hindupuram MLA, Yuvagalam Navashakam sabha, Lokesh Yuvagalam Padayatra

సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్గ స్వర్గమా..? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని వెల్లడించారు. సైకో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగు దేశం పార్టీ నిర్వహించిన.. యువగళం-నవశకం బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజాగళం కదంతొక్కిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పాదయాత్రకు వైసీపీ పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ.. లోకేష్ విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేశారని అన్నారు. పాదయాత్రలో భాగంగా ఎంతో మంది పేద ప్రజల సమస్యలను లోకేష్ విన్నారని చెప్పారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక చెత్త ప్రభుత్వం ఉందని బాలకృష్ణ భగ్గుమన్నారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చేశారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్న లోకేష్.. నాలుగున్నరేళ్లు అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరపడిందని బాలకృష్ణ అన్నారు.

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయిందని లోకేష్ ఆరోపించారు. వైసీపీ అరాచకాలు.. అక్రమాలు ఇలానే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి.. డ్రగ్స్ దందాలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపారని ఆరోపించారు. ల్యాండ్, శాండ్ స్కామ్‌లతో కోట్ల రూపాయలను వైసీపీ పాలకులు దోచుకున్నారని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 7 =