ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్ల ద్వారా వాటిని అప్ లోడ్ చేస్తున్న కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా దాదాపు 2 నెలల అనంతరం ఈ కేసులో రాజ్ కుంద్రాకు ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రూ.50,000 పూచీకత్తు చెల్లించాలని ఆదేశిస్తూ, సెప్టెంబర్ 20, సోమవారం సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ముంబయి పోలీసులు ఇప్పటికే 1400 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లో 43 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటుగా, నటి శిల్పా శెట్టిని కూడా సాక్షిగా చేర్చినట్టు తెలుస్తుంది. దర్యాప్తు ముగియడం, ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో రాజ్ కుంద్రా బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ లభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ