భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 26, శనివారం నాడు జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్), ముగ్గురిని జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీలుగా, 13 మందిని జాతీయ కార్యదర్శులుగా, 23 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, ఆఫీస్ సెక్రెటరీ, సోషల్ మీడియా ఇంచార్జ్, వివిధ మోర్చాలకు జాతీయ అధ్యక్షులను బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
ఈ నియామకాల్లో తెలంగాణకు చెందిన నేత డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చోటు దక్కించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మురళీధర్ రావు, రాంమాధవ్ లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావును కూడా జాతీయ అధికార ప్రతినిధుల జాబితా నుంచి తప్పించారు.
బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం:
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu