బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి మనికా బత్రా చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో ఆరో ర్యాంకర్, మూడు సార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి హినా హయత్పై సంచలన విజయం సాధించింది. బత్రా 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2తో హీనా హయతాపై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణిని చెన్ జూ యుని ఓడించి, మనికా సెమీ ఫైనల్కి చేరింది. తద్వారా ఆసియాకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు సాధించింది.
అయితే, దురదృష్టవశాత్తూ సెమీఫైనల్ మ్యాచ్లో 2-4 (8-11, 11-7, 7-11, 6-11, 11-8, 7-11) తేడాతో మిమా ఇటో చేతిలో ఆమె ఓడిపోయింది. కానీ ఆ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కాంస్య పతక పోరులో బత్రా విజయం సాధించింది. కాగా మనికా బత్రా 2018 కామన్వెల్త్ గేమ్స్లో రెండు బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ టోర్నమెంట్లో మొత్తం నాలుగు మెడల్స్ కైవసం చేసుకుంది. ఇక మనికా సాధించిన ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, పలువురు క్రీడా ప్రముఖులు మనికా బత్రా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE