కరోనాతో బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ కన్నుమూత

Coronavirus Cases, coronavirus india, India Corona Updates, India Coronavirus, India Coronavirus Death, India Covid-19 Updates, MP Ashok Gasti Died Due to Covid-19, Newly elected BJP Rajya Sabha MP Ashok Gasti, Newly Elected BJP Rajya Sabha MP Ashok Gasti Dies, Rajya Sabha MP Ashok Gasti Died Due to Covid-19, Rajya Sabha MP Ashok Gasti dies coronavirus

కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఎంపీ అశోక్ గస్తీ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో సెప్టెంబర్ 2 నుండి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో గురువారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జూలై 22 నే రాజ్యసభ ఎంపీగా అశోక్ గస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. 18 సంవత్సరాల వయసులోనే బీజేపీలో చేరి, కర్ణాటక బీజేపీకి చెందిన యువ మోర్చాకు ఆయన నాయకత్వం వహించారు. ఏబివిపి కార్యకర్తగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యుడుగా కూడా పనిచేశారు. అలాగే కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్‌గా కూడా అశోక్ గస్తీ సేవలందించారు. ఎంపీ అశోక్ గస్తీ మృతి పట్ల పలువురు ప్రముఖులు, కర్ణాటక బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =