తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 16, బుధవారం నాటికి కరోనా పరీక్షలు సంఖ్య 23 లక్షలు దాటింది. బుధవారం నాడు 53,094 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 23,29,316 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 62,740 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కొత్తగా 2159 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,003 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 1005 కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని 1,33,555 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 2108 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 30,443 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu