నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రముఖ దక్షిణాది దర్శకుడుగా గుర్తింపు పొందిన ఆర్కే సెల్వమణిని రోజా వివాహం చేసున్న విషయం తెలిసిందే. తాజాగా ఈయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. లోగడ నమోదైన ఒక పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరు కానందుకు చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆర్కే సెల్వమణి దక్షిణి భారత చలనచిత్ర కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2016వ సంవత్సరంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసుతో కలిసి సెల్వమణి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
అయితే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు తనకు పరువు భంగం కలిగించాయని జార్జి టౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు బోద్రా. అరుళ్ అన్బరసుపై కూడా కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత కేసు వేసిన బోద్రా మరణించారు. కానీ ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఈ క్రమంలో ఈ కేసు కోర్టులో మంగళవారం (ఏప్రిల్ 5వ తేదీన) విచారణకు వచ్చింది. అయితే సెల్వమణి, అరుళ్ అన్భరసుతో పాటు వారి తరపు న్యాయవాదులు కూడా కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జార్జి టౌన్ కోర్టు న్యాయమూర్తి.. సెల్వమణి, అన్బరసు ఇద్దరి పైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ