నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఈ ఉదయం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. పార్టీ నేతలతో కలసి ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ ప్రసంగాన్ని విననున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీకి బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. బండి సంజయ్ బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల శోభాయాత్రను ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ