కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ హంగర్(ఆకలి) ఇండెక్స్- 2020 నివేదికలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల కంటే భారత్ 94 వ స్థానంలో ఉండడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. “భారతదేశంలోని పేదలు ఆకలితో ఉన్నారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక ‘స్నేహితుల’ జేబులను నింపుతోంది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
107 దేశాలకు సంబంధించి అంతర్జాతీయ హంగర్(ఆకలి) ఇండెక్స్- 2020 ను తాజాగా ప్రకటించారు. ఆయా దేశాల్లో ఆకలి స్థాయిలు మరియు పోషకాహార లోపాలకు సంబంధించి వివరాలను హాంగర్ ఇండెక్స్ సూచిస్తుంది. ఇందులో భారత్ 94వ స్థానంలో నిలవగా, పొరుగుదేశాలైన పాకిస్థాన్ 88, నేపాల్ 73, బంగ్లాదేశ్ 75 స్థానాల్లో నిలిచాయి.
भारत का ग़रीब भूखा है क्योंकि सरकार सिर्फ़ अपने कुछ ख़ास ‘मित्रों’ की जेबें भरने में लगी है। pic.twitter.com/MMJHDo1ND6
— Rahul Gandhi (@RahulGandhi) October 17, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu