ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం భారీ వర్షాల వలన రూ.4450 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని, తాజాగా వరదలు కూడా ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని లేఖలో పేర్కొన్నారు. వరదల వలన ఏర్పడిన పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu