దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 13 లక్షలు దాటింది. సెప్టెంబర్ 26, శనివారం నాడు కూడా 20419 కరోనా కేసులు, 430 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,21,176 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 35,191 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 23,644 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 10,16,450 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76.94 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.66 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,69,119 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నాటికీ మహారాష్ట్రలో 63,76,676 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu