గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో భాగంగా 93 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 58.38 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ముందుగా ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం, 3 గంటల వరకు 50.51 శాతం, సాయంత్రం 5 గంటలకు 58.38 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పూర్తి ఓటింగ్ శాతం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. తొలి దశ పోలింగ్ జరిగిన 89 అసెంబ్లీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి 788 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, రెండో దశలో 93 స్థానాలకు గానూ 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1621 మంది భవితవ్యం తేలాలంటే మరో 3 రోజుల్లో తేలనుంది. డిసెంబర్ 8, గురువారంనాడు మొత్తం 182 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా గుజరాత్ లో అధికార బీజేపీ సత్తా చాటి మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందా?, కాంగ్రెస్ ఏ స్థాయిలో పుంజుకుంటుంది?, కీలక కసరత్తు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే విషయాలు తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE