రాహుల్ గాంధీ భద్రతపై అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ, భారత్ జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు ప్రస్తావన

Congress Writes to Union Home Minister Amit Shah over Rahul Gandhi's Security in Bharat Jodo Yatra,Congress Letter To Amit Shah,On Rahul Gandhi Security,Mention Of Security Breaches,Bharat Jodo Yatra,Mango News,Mango News Telugu,Bharat Jodo Yatra,Priyanka Gandhi Participate In Rahul's Yatra, Bharat Jodo Yatra Madhya Pradesh, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, Inc Latest News And Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress President Mallikarjun Kharge

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు.

“భారత్ జోడో యాత్రలో గణనీయమైన భద్రతా ఉల్లంఘనలను మీ దృష్టికి తెస్తున్నాను. భారత్ జోడో యాత్ర 2022 డిసెంబర్ 24న ఢిల్లీలోకి ప్రవేశించినప్పుడు, భారత్ జోడో యాత్ర భద్రతపై పలుమార్లు రాజీ పడ్డారు, మరియు జెడ్ ప్లస్ భద్రత ఉన్న రాహుల్ గాంధీ చుట్టూ పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. రాహుల్ గాంధీ వెంట నడిచే కాంగ్రెస్ కార్యకర్తలు మరియు భారత యాత్రీస్ ఆయన చుట్టూ వలయంలా ఏర్పడవలసి వచ్చినంతగా పరిస్థితి తీవ్రంగా ఉంది. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రేక్షకులుగా ఉండిపోయారు. ఇంకా పాల్గొనేవారిని వేధించడానికి మరియు ప్రముఖ వ్యక్తులు భారత్ జోడో యాత్రలో చేరకుండా నిరోధించడానికి, ఇంటెలిజెన్స్ బ్యూరో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న చాలా మందిని విచారిస్తోంది. అంతేకాకుండా, హర్యానాలోని భారత్ జోడో యాత్ర యొక్క కంటైనర్‌లలోకి హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తుతెలియని వారు అక్రమంగా ప్రవేశించారని మేము హర్యానాలోని సోహ్నా సిటీ పోలీస్ స్టేషన్‌లో 2022, డిసెంబర్ 23వ తేదీన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసాము” అని లేఖలో పేర్కొన్నారు.

“రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం, ప్రతి పౌరుడికి భారత భూభాగం అంతటా సమావేశమయ్యే మరియు స్వేచ్ఛగా తిరిగే రాజ్యాంగ హక్కు ఉంది. భారత్ జోడో యాత్ర అనేది దేశంలో శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి చేపట్టిన పాదయాత్ర. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడకుండా కాంగ్రెస్ నేతలకు భద్రత కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానులు ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీ దేశ సమైక్యత మరియు సమగ్రత కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. 2013 మే 25న జిరామ్‌ఘాటిలో జరిగిన నక్సల్స్ దాడిలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 2023 జనవరి 3 నుండి తిరిగి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర తదుపరి దశలో సున్నితమైన రాష్ట్రమైన పంజాబ్ మరియు జమ్మూ అండ్ కశ్మీర్ లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో జెడ్ ప్లస్ భద్రత ఉన్న రాహుల్ గాంధీకి మరియు భారత్ జోడో యాత్రలో చేరిన భారత యాత్రీస్ మరియు నాయకులందరికీ భద్రత కల్పించడం మరియు భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని కేంద్ర అమిత్ షాకు రాసిన లేఖలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =